శ్రీవారిని దర్శించుకున్న రమణాచారి

తిరుమల,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదా,టిటిడి మాజీ ఇవో డాక్టర్‌ కెవి రమణాచారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనార్దం తిరుమల చేరుకున్న రమణాచారికి టీటీడీ ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేయగా… ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కోన్నారు. రమణాచారిని పలువురు ఉద్యుగులు కలసి అభినందించారు.