శ్రీవారి సొమ్ములను ధార్మిక పనులకే వినియోగించాలి

ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు

తిరుమల,నవంబర్‌12(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఇవాళ ఉదయం భాజపా నాయకులతో కలిసి సోము వీర్రాజు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విూడియాతో మాట్లాడుతూ… శ్రీవారి సంపదపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. సహజ వనరులు, ప్రకృతి సంపదలకు నెలవైన రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేలా రాష్ట్రంలోని పాలకులకు జ్ఞానం ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సహజ వనరులు, ప్రకృతి సంపదలకు నెలవైన ఏపీ అగ్రగామిగా తీర్చిదిద్దేలా… పాలకులకు జ్ఞానం ప్రసాదించాలని స్వామి వారిని సోము వీర్రాజు వేడుకున్నారు.