శ్రీవారి హుండీకి రూ. 5.41 కోట్లు ఆదాయం

 

 

 

 

 

తిరుమల: తిరుమలలోని శ్రీవారిని నిన్న 56,559 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,751 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల రూపేణా శ్రీవారి హుండీకి రూ. 5.41 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. సర్వదర్శనం భక్తులకు కేటాయించేందుకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.

వీఐపీలకు కేటాయించిన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించనున్నట్లు టీటీడీ వివరించారు. అందుకు అనుగుణంగా అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే సర్వదర్శనం భక్తులకు రోజుకు 30వేల టోకెన్లు జారీ చేస్తుండగా తాజా నిర్ణయంతో మరో రెండు గంటల దర్శన సమయం పెరగనుంది.