శ్రీ భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఈశాంత్

నల్లగొండ జిల్లా కేంద్రంలో గీతా జయంతి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీ భగవద్గీత పోటీలలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సిహెచ్ బాల సైదులుఉమా దంపతుల  ఏకైక కుమారుడు ఈషాంత్ యాదవ్ ప్రథమ స్థానం పొందారు. ఈషాంత్ యాదవ్  గత సంవత్సరం జరిగిన పోటీలో కూడా ప్రథమ స్థానం సాధించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో  జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. భగవద్గీత కంఠస్థ పోటీలలో  ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో రెండుసార్లు ప్రథమ స్థానం సంపాదించడం అభినందనీయం అన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థి ఈషాంత్ యాదవ్ ను పలువురు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ప్రథమ స్థానం సాధించి హుజూర్ నగర్ ప్రత్యేకతను నిలపాలని కోరారు. భగవద్గీత పట్ల ప్రావీణ్యత సాధించేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు.