షిండేతో ఎంపీ వివేక్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దపల్లి ఎంపీ వివేక్‌ భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన షిండేకు వివరించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం తెలిసింది.