సంక్షేమంలో తెలంగాణ ముందుంది: ఎమ్మెల్యే

వరంగల్‌,మే29(జ‌నం సాక్షి): ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకవెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సం క్షేమ పథకాలతో పాటుగా సాగు, తాగునీరు కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ గ్రామకమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ ప్రభుత్వ పథకాలను, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోనికి తీసుకవెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ది బాటలో పాలన సాగిస్తున్నారని,క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవిూత్‌షా తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులకు కాకి లెక్కలు చూపించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన ముఖ్యంత్రి రాష్ట్ర అభివృద్దికి సైతం పగలనక రాత్రనక కష్టపడుతున్నారని అన్నారు. అయితే  బీజేపీ అభివృద్ది చూసి ఓర్వలేకనే విమర్శలు గుప్పిస్తుందన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు.