సంజయ్‌దత్‌ పై నిర్మాతల పిటిషన్‌ను తోసిపుచ్చిన సప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: 1993 ముంబయి బాంబు పేలెళ్ల కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువుపై నిర్మాతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమాల పూర్తికి మరింత సమయం కావాలని పిటిషన్‌లో నిర్మాతలు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు లొంగుబాటు గడువు పెంచేదిలేదని గతంలేనే స్పష్టం చేసినట్లు తెలిపింది.