సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
17 నిముషాల్లో పని ఖతం చేశామని వ్యాఖ్య
ముంబై,నవంబర్23(జనంసాక్షి): శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూలగొట్టామని ఆయన విూడియాతో మాట్లాడుతూ చెప్పారు. శివసేన సుప్రీం ఉద్ధవ్ థాక్రే అయోధ్య పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ విూడియాతో మాట్లాడారు.
అయోధ్యలో రామాలయం నిర్మించి తీరాలని, ఎన్నికల్లో ఆలయ నిర్మాణానికి తాము హావిూ ఇచ్చామని
ఆయన చెప్పారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన నిలదీశారు. మసీదును కూలగొట్టడానికి రామభక్తులకు 17 రోజులు పడితే, ఆలయ నిర్మాణంపై చట్టం చేయడానికి ఏళ్లూ పూళ్లూ ఎందుకు పడుతోందని మండిపడ్డారు. ఉద్ధవ్ అయోధ్య పర్యటనకు ముందు సంజయ్రౌత్ ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేయడంతో మందిరం సమస్య వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోందని, అయోధ్య సమస్యను శివసేన తమకు అనూకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి.