సంస్కారం కావాలంటే గాంధీభవన్‌కు రండి

కెసిఆర్‌ కుటుంబం సంస్కారహీనమైంది
కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి
హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో సంస్కారం లేని కుటుంబం కేసీఆర్‌ కుటుంబమని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంస్కార హీనుడంటూ వ్యాఖ్యలు చేశారు. సంస్కారం కావాలంటే గాంధీ భవన్‌ కొస్తే తాము నేర్పిస్తామన్నారు. పదేండ్లలో ధనిక రాష్టాన్న్రి అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఓర్చుకోలేకపోతున్నారని.. అందుకే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారని.. దాని పర్యవసానమే ఈరోజు మహిళా కమిషన్‌ ముందు కేటీఆర్‌ హాజరయ్యారన్నారు. మహిళలకు గౌవరవం దక్కాలంటే అది కాంగ్రెస్‌లోనే దక్కుతుందని తెలిపారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న వదులుకున్న గొప్ప నాయకుడు రాహుల్‌ గాంధీ అని శోభారాణి పేర్కొన్నారు.