సడక్బంద్ను సమర్థించిన నారాయణ
గుంటూరు : తెలంగాణలో చేపట్టిన సడక్బంద్ను సమర్థిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం మంగళగిరి సమీపంలోని పెద్దవడ్లపూడిలో ప్రారంభమైన సీపీఐ శిక్షణా తరగతులకు నారాయణ హాజరయ్యారు. కేంద్రప్రభుత్వానికి డీఎంకే మద్దతు విరమించుకోవడంతో సీబీఐ చేత దాడులు చేయించి బ్లాక్మెయిల్కు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు ఇద్దరు ఉత్సవ విగ్రహాలే అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేంద్రాన్ని సీబీఐ సంస్థ పరిసాలిస్తోందని నారాయణ అన్నారు.