సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలు

హైదరాబాద్‌ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు జైళ్లశాఖ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని హైదరాబాద్‌ జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖర్‌ అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నేళ్లుగా ఉంటూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను పరిశీలించినట్లు చెప్పారు. ఈ జాబితాలో ఉన్న 44 మందిని ఎంపిక చేసి రాష్ట్రంలో ఉన్న ఖైదీల వ్యవసాయ క్షేత్రాలకు తరలించనున్నట్లు చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ కేఎల్‌ శ్రీనివాస్‌ చెప్పారు.