సమస్యలపై అధికారులతో కలిసి కాలనీలలో పర్యటించిన: కార్పొరేటర్ ఆకులశ్రీవాణి అంజన్ కుమార్

డివిజన్ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని సరూర్నగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కుమార్ అన్నారు. కాలనీవెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఇంజనీరింగ్  హెచ్ఎండబ్ల్యూఎస్   , శానిటేషన్  అధికారులతో కలిసి  జేబీ కాలనీ శ్రీ వెంకటేశ్వర కాలని  లో పర్యటించి ప్రజా  సమస్యల గురించి తెలుసుకొని సంబంధించిన అధికారులకు నిర్దేశించడం జరిగింది. సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ కుమార్ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.