సమైక్యాంధ్రకే మొదటి ప్రాధాన్యత: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సమైక్యాంధ్రకే తన మొదటి ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రాయలసీమ జిల్లాలను విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్సకు స్పష్టం చేసిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.