సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మికులు జనంసాక్షి, మంథని

తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంథని మున్సిపల్ లో చైర్పర్సన్ పుట్ట శైలజ, కమిషనర్ సతీష్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ పాల్గొని మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అలోపు ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్తున్నట్టు వేతనాలు చెల్లించాలని, లేబర్ కోట్లు రద్దు చేయాలని, కార్మికుల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు గడిపల్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, కోశాధికారి సింగారపు గట్టయ్య, మున్సిపల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.