సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటాం
-చైనా ప్రధాని
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్ అన్నారు. వాణిజ్య అసమానతలు రూపుమాపేలా ఇరు దేశాల చర్చల ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్తో చర్చల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతున్నట్లు అశాభావం వ్యక్తం చేశారు. చైనా మార్కెట్లో భారత్ ఉత్పత్తుల ప్రవేశానికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.