సహకార విజయంపై సోనియాకు వివరించిన సీఎం

న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వివరించారు. ఈ రోజు ఉదయం ఆమెతో భేటీ అయిన ముఖ్యమంత్రి పార్టీ వ్యవహారాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ రోజు ఢిల్లీలో వరసగా పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్న ముఖ్యమంత్రి ఇవాళ రాత్రికి కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.