సాధినేనికి సామాజిక వేధింపులు

అమరావతి,మార్చి5(జ‌నంసాక్షి): టిడిపి ఎపి అధికార ప్రతినిధి సాధినేని యామినికి సామాజిక మాధ్యమాల్లో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఆకతాయిలు యామిని ఫోన్‌ నంబర్‌ ను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆమెకు రోజుకు 20 నుంచి 30 మంది ఆకతాయిలు ఫోన్‌ చేస్తూ వేధింపులకు గురిచేయడం ప్రారంభించారని తెలుస్తోంది. అర్ధరాత్రులు ఫోన్‌ చేయడం, అసభ్యకరమైన సందేశాలు పంపుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్ఫింగ్‌ ఫొటోలను ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేసి దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలో యామిని పీఆర్వో పొట్లూరి వెంటక సుధీర్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.