సిఎం జగన్‌తో క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ నోరి భేటీ

ప్రాజరోగ్యంపై ఇరువురు చర్చ
అమరావతి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను విఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు కలిశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలు అలాగే క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుధీర్ఘంగా చర్చించారు. పరస్పరం ఆలోచనలు పంచుకున్నామని డాక్టర్‌ నోరి తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్సకోసం ఆస్పత్రులు పెట్టాలని, అందులో ఒక దాన్ని అత్యాధునికంగా ఏర్పాటచేయాలని సీఎం సంకల్పించినట్టు డాక్టర్‌ నోరి వెల్లడిరచారు. వివిధ మెడికల్‌కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సలను దీనికింద తీసుకురా వాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళికగా సమావేశం తర్వాత డాక్టర్‌ నోరి వెల్లడిరచారు. క్యాన్సర్‌ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలను తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం ఇతర రాష్టాల్రకు వెళ్లాల్సిన అవసరంలేకుండా రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగిందని డాక్టర్‌ నోరి తెలిపారు. రాష్టాన్రికి తగిన సహాయసహకారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనికి ముఖ్యమంత్రి సంతోషించారని వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ చికిత్సా విధానంలో గొప్ప అడుగు ముఖ్యమంత్రి సమావేశం ద్వారా ఏర్పడిరదని డాక్టర్‌ నోరి తెలిపారు. సీఎం ఆరోగ్యరంగంలో తీసుకున్న చర్యలన్నీ తనకు చాలా నచ్చాయన్నారు. మెడికల్‌ కాలేజీలను, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం అన్నది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని చెప్పారు. చిన్న గ్రామంలో క్యాన్సర్‌ రోగి ఉన్నా.. చికిత్స కోసం పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని సీఎం కోరారు. ఈమేరకు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.