సిటివో నివాసాల్లో ఎసిబి సోదాలు

కర్నూలు,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి నాగేందప్రసాద్‌ ఇళ్లలో సోదాలు కొనసాగతున్నాయి. కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌, అనంతపురంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. సోదాల్లో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతపురంలో అపార్ట్‌మెంట్‌, కర్నూలులో ఇల్లు, 630 గ్రా. బంగారం గుర్తింపు, బ్యాంకు పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నాగేందప్రసాద్‌ భారీగా అక్రమాస్తులను కూడబెట్టారు. గతేడాది డిసెంబర్‌ 7న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి నాగేందప్రసాద్‌ పట్టుబడ్డ విషయం తెలిసిందే.