సీఏం కిరణ్‌కు టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ లేఖ

హైదరాబాద్‌: సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు విషయానికి సంబంధించి  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ బహిరంగ లేఖ రాశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, 300పడకల సామర్థ్యం, 3ఎకరాల భూమిని సింగరేణి మేనేజమెంట్‌కు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  నాలుగైదు దశాబ్ధాలుగా పేదలకు సింగరేణి ఆసుపత్రి సేవలు అందిస్తోందని తెలిపారు. వెంటరనే సీఏం చొరవ తీసుకొని కళాశాల ఏర్పాటు కోసం ఎంసీఐకి సిఫార్సులు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 21వరకు మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.