సీపీఐ మండల అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 5
చిగురుమామిడి మండల సిపిఐ కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తల్లి ఆదివారం మృతి చెందగా సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత వారి కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలు తెలుసుకుని వారిని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.