సుభాష్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ సుభాష్ నగర్ లోని 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కాలనీ కమ్యూనిటీ హాల్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధి తమ ధ్వేయమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, మున్సిపల్ అధికారులు ఈఈ రాజు, డిఈ కార్తీక్, ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు భాస్కర్, బిఎన్ రమేష్, ఈశ్వర్ గౌడ్, వంశీ గౌడ్, నరేష్, సత్తన్న, ఓం ప్రకాష్, సంజీవరావు, శ్రీనివాసరావు, సామేలు, సత్యనారాయణ, శివ, సురేష్, మురళి, పెంటన్న, జమందర్, రాజు, బాల నరసింహ, మల్లేష్ గౌడ్, మల్లేష్, శంకర్, మోసిన్, జామ మహేందర్, లక్ష్మి, ఉదయ, స్వప్న, కల్పన, రమ, తదితరులు పాల్గొన్నారు.