సెల్పీ దిగి ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు బాలికలు

 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): పదిహేడేళ్ల వయసుగల ఇద్దరు బాలికలు సెల్ఫీ దిగి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ముంబయి నగరంలోని ఆరీ కాలనీలో వెలుగుచూసింది. విూనాక్షి, సోనాలీలనే ఇద్దరు అమ్మాయిలు ఆరీ కాలనీలోని బావి వద్దకు వచ్చారు. ఇద్దరూ కలిసి వారి సెల్‌ ఫోనులో సెల్ఫీ దిగారు. అనంతరం వారిద్దరూ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విూనాక్షి ఇంటరు చదువుతుండగా, సోనాలీ పదోతరగతితో చదువు ఆపేసి కుట్టు శిక్షణ పొందేది. ఇద్దరు బాలికలు ఇంట్లో చెప్పకుండా వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. వారి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.