సేవా గుణ సంపన్యుడు రొంపల్లి సంతోష్ కుమార్.

సేవా గుణ సంపన్యుడు రొంపల్లి సంతోష్ కుమార్.

గాంధీ జయంతిన డాక్టరేట్, శాంతి సేవా రత్న అవార్డు
మనం ఫౌండేషన్ కు కృతజ్ఞతలు.
తాండూరు అక్టోబర్ 3(జనంసాక్షి)సమాజసేవలో
సేవాగుణ సంపన్యుడు రొంపల్లి సంతోష్ కుమా ర్ కు గాంధీ జయంతి రోజు డాక్టరేట్ తోపాటు శాంతి సేవా రత్న అవార్డులను అందుకున్నారు.
సోమవారం గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సిటీ కల్చరల్ సెంటర్ లో అంతర్జాతీయ గుర్తింపు పొందినమనం పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రవేటు, ప్రభుత్వ రంగాలలో వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రావీణ్యం పొందిన వారికి ఉత్తమ సేవా పురస్కరాలను అందజేశారు.ఇందులో బాగంగానే తాండూరు
పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ రొంపల్లి సంతోష్ కుమార్ కు అవకాశం లబించింది.తాండూరు నియోజక వర్గంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్య యువజన సంఘం లైన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా తన సొంత డబ్బులతో వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుమారు 45 రోజులపాటు ఉచిత రాగి అంబలి మజ్జిగ పంపిణీ చేస్తారు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా మనం ఫౌండేషన్ సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్ ను గుర్తించి ఉత్తమ డాక్టరేట్ సర్టిఫికెట్ తో పాటు మహాత్మ గాంధీ శాంతి సేవా రత్న అవార్డును అందజేశారు ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేద ప్రజలను గుర్తించి నిత్యవసర వస్తువులు మరియు కుట్టు మిషన్లు వికలాంగులకు వీల్ చైర్లు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నిరుపేద ప్రజల సంతోషమే తన సంతోషమని చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన గాని సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటానని వెల్లడించారు.పరమేశ్వరుని ఆశీస్సులు ఉన్నంతవరకు నిరంతరం సేవలు కొనసాగిస్తానని తెలిపారు.