సొరంగంలో నిలిచిపోయిన ఢిల్లీ మెట్రో రైలు

ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలోని జహంగీర్‌పురి- హుడా సిటీ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రోరైలు ఇకటి మంగళవారం ఉదయం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అది సరిగ్గా పొరంగంలో నిలిచిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణీకులు ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు లోనయ్యారు. అధికారులు రంగంలోకి దిగి వారందరినీ ఇతర వాహనాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. నిలిచిపోయిన రైలును తొలగించేవరకు ఆ మార్గంలో మెట్రో రైళ్ల ప్రయాణానికి ఆటంకం కలిగింది.