సోనియాగాంధీతో కలిసి పనిచేస్తున్నా : మన్మోహన్‌సింగ్‌

న్యూఢల్లీి : అన్ని అంశాలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి పనిచేస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడిరచారు. థాయిలాండ్‌ నుంచి తిరిగి వస్తూ ప్రధాని మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ, తాను తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబేయే నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో విపక్షాల తీరును తప్పుబట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఐపీఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై స్పందిస్తూ రాజకీయాలు, వేర్వేరు అంశాలని వ్యాఖానించారు.