సోనియాతో దిగ్విజయ్సింగ్ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలిన్చార్జ్ దిగ్విజయ్సింగ్ శనివారం ఉదయం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై సోనియా, దిగ్విజయ్ సింగ్ల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవలే దిగ్విజయ్సింగ్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభననపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో అటు సీమంధ్ర నేతలు, ఇటు తెలంగాణ నేతలు దిగ్విజయ్సింగ్ను కలిసి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాతో దిగ్విజయ్సింగ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.