సోనియాతో మందకృష్ణ భూటీ

న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదగ కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరితో కలిసి యూపీఏ ఛైర్‌పర్సస్‌ సోనియా గాంధీతో శనివారం భేటీ అయ్యారు. అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణను పూర్తిచేయాలని సోనియాను కోరినట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఎస్సీ ఓట్లను కాంగ్రెస్‌ వదులుకోవాల్సిందేనని సూచించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన అంశమని… రాజకీయ, సాంకేతిక అవరోధాలు లేవని సోనియాకు వివరించినట్లు మందకృష్ణ వెల్లడించారు.