సోనియాతో రాహుల్‌, ద్వివేది సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీనియర్‌ నేత జనార్ధన్‌ ద్వివేది సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసీసీ , కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 17న కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగనున్న విషయం తెలిసిందే.