సోనియాతో సుమారు గంటకుపైగా కిరణ్‌ చర్చలు

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధినేత్ర సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణ అంశం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు ఆజాద్‌తో సీఎం బేటీ అయి రాష్ట్ర పరిస్థితులపై చర్చలు జరిపారు.