స్థానిక ఎన్నికలకు సర్కారు సై

` నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌
` కేబినెట్‌ సమావేశ అనంతరం తేదీని ప్రకటిస్తాం
` వారం రోజుల్లో ‘రైతు భరోసా’
` సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమచేస్తాం
` సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదే..
` ఎన్నికలల్లో విజయం కోసం కాంగ్రెస్‌ శ్రేణులు కృషిచేయాలి
` అందుకు సిద్ధం కావాలి: మంత్రి పొంగులేటి
ఖమ్మం(జనంసాక్షి): ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల ముఖ్యనేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు.స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని.. కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని చెప్పారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. వారం రోజుల్లో ‘రైతు భరోసా’, సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు.కాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రెండేళ్లుగా చర్చ సాగుతోంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రస్తుతం అడుగులు వేస్తోంది రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. వారం రోజుల్లో అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్‌ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని వెల్లడిరచారు. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు.. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు.

 

బీసీ రిజర్వేషన్‌ సంగతేంది?
` కామారెడ్డి డిక్లరేషన్‌ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందే..
` అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మంత్రి పదవులు మూడేనా!
` మండిపడ్డ భారాస నాయకులు
హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్‌ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కులగణన ఏదో గొప్పగా చేశామని ఇది దేశానికి రోల్‌ మోడల్‌ అని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ వాళ్ళు ఎన్నికల్లో చెప్పిందేమిటి ?చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు. కులగణన తప్పుల తడకగా చేశారని .. అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మూడేనా మంత్రి పదవులు అని నిలదీశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్దత ఏదీ ? కీలక శాఖలు బీసీల దగ్గర ఎందుకు లేవు? ఏడాదికి రూ.20వేల కోట్లు బీసీ లకు బడ్జెట్‌ లో పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి ? 42 శాతం సీట్లు బీసీలు ఎలాగైనా గెలుస్తారు.. మీరు ఇచ్చేది ఏమిటి అని నిలదీశారు.కేంద్రానికి బీసీ బిల్లును పంపించి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో ప్రధాని మోదీని కలిసినపుడు బీసీ బిల్లు చట్టబద్ధత గురించి ఎందుకు చర్చించ లేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీసీలోని అన్ని కులాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇంకా ఎన్నాళ్లు బీసీలను మోసం చేస్తారని మండిపడ్డారు. ఏదో రైతుబంధు డబ్బులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే వచ్చే ఎన్నికల దాకా ఏ హామీలను పట్టించుకోరని తెలిపారు. రెండుసార్లు మోసపోయిన ప్రజలు.. ఇకపై మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి పాలనలో కులవృత్తుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. బీసీలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌ ఆగడాలకు అంతే ఉండదని పేర్కొన్నారు. దీనిపై బీసీ సంఘాలు కూడా స్పందించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు . కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేస్తే బీసీలు కాంగ్రెస్‌కు రెడ్‌ కార్పెట్‌ పరుస్తారని చెప్పారు.అందాల పోటీలతో డబ్బులు వృథా చేశారని.. అదే ఫార్ములా ఈ రేసింగ్‌లో ఎలాంటి అవినీతి జరగకున్నా కానీ కేటీఆర్‌ను విచారణ పేరుతో వేధిస్తున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. నోటీసులకు భయపడమని స్పష్టం చేవారు. అన్ని పార్టీల్లోని బీసీలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు.