స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావం వల్ల రాగల 24గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.