స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల తెలంగాణలో పలు చోట్ల, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.