స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం… వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలను అనుకుని స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనికితోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడా భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు.