స్పాట్‌ ఫిక్సింగ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి

ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా
న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా అన్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు అరుణ్‌జైట్లీని ఆయన ఈ ఉదయం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధ్యతల నుంచి దూరంగా ఉండాల్సిన అంశంపై బీసీసీఐ ఛైర్మన్‌ శ్రీనివాసస్‌ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఫిక్సింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు బృందం సిఫార్సులను అమలు చేస్తామని తెలిపారు.