స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాలి

మదురైలో ప్రజాప్రయోజన వ్యాజ్యం

చెన్నై : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక క్రికెట్‌ అభిమాని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి జూన్‌ 10 లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు , ఐపీఎల్‌ చైర్మన్లకు నోటీసులు జారీ చేశారు.