స్వచ్ఛత రన్ లో గ్రామ సర్పంచ్

 మండల పరిధిలో ఉన్న గారకుంట తండ గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛత రన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు బాబు నాయక్ పాల్గొన్నారు. గ్రామంలో వీధి వీధికి తిరుగుతూ ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తడి పొడి చెత్త విధానాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని గ్రామపంచాయతీ ద్వారా ఇంటి ఇంటికి వస్తున్న ట్రాక్టర్ కి వేరువేరుగా తడి చెత్త పొడి చెత్త వేసి గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ పాల్వాయి రమ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బొబ్బ వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు  సునీత, అంగన్వాడి టీచర్ కవిత, గ్రామ యూత్ అధ్యక్షులు సందీప్ నాయక్, నందా నాయక్ విద్యార్థిని విద్యార్థులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.