స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: భారతీయ స్టాక్‌మార్కెట్టు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభాలతో స్థారపడగా, ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 16.50 పాయింట్ల లాభంతో 5983.55 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్‌, టాటా పవర్‌, ఐసీఐసీఐ బ్యాంకు లాంటివి లాభాలు గడించగా సన్‌ఫార్మా, హిందాల్కో, భెల్‌, టీసీఎన్‌, సిప్లా నష్టాలు చవిచూశాయి.