స్వావిూజీ రాజకీయాలు మానండి

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని
అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): విశాఖ శారదా పీఠాధిపతిపై స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి రాజకీయాలు చేయడం మానుకోవాలని  టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాలుచేయాలనుకుంటే నేరుగా రావచ్చన్నారు. సీఎం చంద్రబాబుపై కేసు వేస్తానని స్వరూపానంద అనడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పీఠాధిపతిగా ఉండి వైసీపీకి అనుకూలంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. స్వావిూజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటన్న ఆమె.. ప్రవచనాలు చెప్పాల్సిన స్వావిూజీ.. రాజకీయాలు బోధించడమేంటని మండిపడ్డారు. రాజకీయాలు చేయాలంటే పీఠాధిపతి పదవి వదిలేసి… వైసీపీలో చేరవచ్చని సూచించారు.