హాత్ సే హాత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలి. డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్.

 

కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్, జిల్లా డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జూడో యాత్రకి స్ఫూర్తిగా గురువారం నుండి ఉమ్మడి కోటగిరి మండలంలో ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన ఉదయం పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రతి గడప గడపకు హాత్ సే హాత్ జోడో పాదయాత్ర యొక్క ఉద్దేశాలను వివరించడంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాల నీ వారు కోరారు