హావిూలను విస్మరించిన టిడిపి ప్రభుత్వం

అందుకే రాజీనామా చేశానన్న మాణిక్యాల రావు

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): నియోజకవర్గానికి ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత,మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావు మండిపడ్డారు. నిర్లక్ష్యానికి నిరసనగా ఆయన ఇటీవల దీక్ష కూడా చేపట్టారు. అనంతరం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన దీక్ష కూడా చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం విూడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు. రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందిని చెప్పుకొచ్చారు.