హిందూ శక్తి – ధర్మాన్ని అందరం కాపాడుకోవాలి

మహేశ్వరం రామాలయం భూకబ్జాపై శ్రీరాములు ఆగ్రహం.
ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని మంత్రి సబితమ్మపై ఆగ్రహం
గడికోట భూఆస్తి శ్రీరాములోరిదే – అందెల
 ఎల్బీనగర్ (జనం సాక్షి )శ్వరం పట్టణంలోని గడికోట రామాలయం గుడి మాన్యాన్ని కాపాడుకునేందుకు హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. ఆదివారం నాడు  శ్రీ రాజరాజేశ్వరాలయంలో అయ్యప్ప స్వాములు, హిందూ బంధువులతో సమావేశమయ్యారు.
అనంతరం గడికోటలో రామాలయం భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. దేవుని భూములను కబ్జా చేస్తున్న ఓ వర్గానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొమ్ము కాస్తూ… హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.
హిందూశక్తి, ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే… ఔరంగజేబ్ కు పట్టిన గతే నేటి పాలకులకు పడుతుందని హెచ్చరించారు శ్రీరాములు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఏ ఆలయ ప్రతిష్టను దెబ్బ తీయాలని చూసినా సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు అందెల శ్రీరాములు యాదవ్.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంస్థలు సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు