హుదూద్ బాధితులకు రూ.2220కోట్లు

ozq0aqd0హుదూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన నాలుగు జిల్లాలకు రూ.2220 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. గత యేడాది సంభవించిన హుదూద్ తుఫాను విశాఖపట్టణంతో పాటు మొత్తం నాలుగు జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ప్రాంతాన్ని ఆదుకునేందుకు వీలుగా ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది.