హెలికాప్టర్లను పంపిన గుజరాత్, రాజస్థాన్
ఢిల్లీ : ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను కాపాడేందుకు రాజస్థాన్ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు, 30 బస్సులను కేటాయించింది. సహాయక చర్యల కోసం గుజరాత్ ప్రభుత్వం కూడా రెండు హెలికాప్టర్లను కేటాయించింది. పుణెకు చెందిన 30 మంది యాత్రికులను ఆర్మీ సిబ్బంది రక్షించారు. పలుప్రాంతాల్లో ఇంకా 200 మంది పుణె పరిసర వాసులు చిక్కుకున్నట్లు సమాచారం.