హేమమాలిని రెండో కుమారై నిశ్చితార్థం

ముంబయి: ప్రముఖనటి హేమమాలిని, ధర్మేంద్రల రెండో కుమార్తె అహనా డియోల్‌కి ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, వైభవ్‌ వోరాతో నిశ్చితార్థం జరిగింది. గత ఏడాదే వీరి పెద్ద కుమార్తె ఈషాడియోల్‌ భరత్‌ తఖ్తానీ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం జుహులోని హేమమాలిని నివాసంలో అహనా నిశ్చితార్థ వేడుక జరిగింది. పెళ్లికి తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఒడిస్సీ సంప్రదాయ నృత్యకళాకారిణి అయిన అహనా పలు నృత్యప్రదర్శనలిచ్చారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లోనూ ఆమెకు ఆసక్తి ఉంది.