హైదరాబాద్‌ చేరుకున్న సిఎం రేవంత్‌ బృందం

శంషాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్‌ శ్రేణులు
హైదరాబాద్‌,ఆగస్ట్‌14  (జనం సాక్షి) : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్టాన్రికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. సీఎం బృందానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలికారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేవంత్‌ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసిందని శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన సాగగా.. చాలా రోజుల తర్వాత రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ కు చేరుకున్నారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా లోని సియోల్‌ కి చేరుకున్నారు. దక్షిణ కొరియాలో రెండ్రోజుల పాటు రేవంత్‌ రెడ్డి పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు.. వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్‌తో కాగ్నిజెంట్‌ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికా లోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్‌ టేబుల్‌ విూటింగ్‌లు నిర్వహించి పలు కంపెనీ లను క్షేత్ర స్థాయిలో సీఎం రేవంత్‌ రెడ్డి సందర్శించారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో, రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు జరిపారు. కొరియా బ్యూటీ ఇండస్టీ ట్రేడ్‌ అసోసియేషన్‌తో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్‌, ఎల్‌జీ ఎలక్టాన్రిక్స్‌, జీఎస్‌ క్టలెక్స్‌, సెల్‌ ట్రయాన్‌ కంపెనీ ప్రతినిధుల తోనూ సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు జరిపారు. హన్‌ రివర్‌ ప్రాజెక్టును సందర్శించి సియోల్‌ డిప్యూటీ మేయర్‌ తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్‌ హెల్త్‌ కేర్‌ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సీఎం రేవంత్‌ రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌ టెక్స్‌ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్‌ టెక్స్‌టైల్స్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్టీ సానుకూలంగా స్పందించింది.