హైదరాబాద్ లో గూగుల్ సంస్థ ప్రాంగంణం…

అమెరికా: గూగుల్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గూగుల్ ఉపాధ్యక్షుడు రాడ్‌క్లిఫ్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌లు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీంతో హైదరాబాద్ నగరంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థం ప్రాంగణం నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నాలుగేళ్లలో 13 వేల మందికి ఉపాధి అవకాశం. గూగుల్ సంస్థ ఆసియా ఖండంలోనే మొదటిసారిగా తన తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.