హోంమంత్రి పదవి కోసం రాలేదు: డిప్యూటీ సీఎం దామోదర

న్యూఢల్లీి,(జనంసాక్షి): తాను హోంమంత్రి పదవి కోసం ఢల్లీి రాలేదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతూ విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అధిష్టానంతో మాట్లాడాటానికే ఢల్లీి వచ్చానని, హోం మంత్రి పదవి కోసం వచ్చాననడం వాస్తవం  కాదని తెలిపారు.   కాగా , మరికొద్ది గంటల్లో  ఆయన హైదరాబాద్‌కు చేరకోనున్నారు.