హ్యాకింగ్‌కు గురైన పోలీసు సిబ్బంది వేతనాల ఎకౌంట్లు

గ్రీన్‌ దేశంలో నగదు డ్రా

ముంబయి: ముంబయికి చెందిన పలువురు పోలీసుల వేతనాల ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. 14 మంది పోలీసుల యాక్సిన్‌ బ్యాంకు ఎకౌంట్లనుంచి డబ్బును గ్రీస్‌ దేశంలో ఏటీఏంల ద్వారా డ్రా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. యూరోలలో డబ్బు డ్రా చేయడంతో దానికి సమాన మొత్తంలో పోలీసుల ఎకౌంట్ల నుంచి రూపాయలు మాయమయ్యాయి. ఈ పోలీసుల డెబిట్‌కార్డులు క్లోన్‌ చేసి మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలకు దర్యాప్తు కొనసాగుతోంది.