11 మంది భారతీయులను కాపాడిన పాక్

ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని తెలిపింది. పూర్తిగా అల్ కాయిదా వారి హస్తగతంలో ఉన్న యెమెన్లోని మొకల్లా అనే నగరం నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ నౌకను పంపించింది. అక్కడి వారితో చర్చలు జరిపి మొత్తం 148 మంది పాకిస్థానీయులను తమ నౌకలో ఎక్కించుకోవడమే కాకుండా మరో 35 మంది విదేశీయులకు కూడా ఆశ్రయం కల్పించింది.